వెల్లంకి తాతంభట్టు. ఇతడు కవిచింతామణి యనులక్షణగ్రంథమును జేసిన గొప్పకవి. ఈతడు వైదికబ్రాహ్మణుడు; ఈతని తండ్రి యబ్బయ్య; తల్లి యెర్రమ్మ. ఈకవి కృష్ణరాయని రాజ్యారంభకాలమునం దుండినవాడు. కొంద రీతడు కృష్ణదేవరాయని కాలమునకు బూర్వమునందేయుండెనని చెప్పుదురుగాని యితడు తన కవిచింతామణిలో నైషధము, భోగినీదండకము, జైమినిభారతము మొదలగు గ్రంథము లనుండి యుదాహరణములు గైకొని యుండుటచేతను, జైమినిభారతమును రచించిన పిల్లలమఱ్ఱి పినవీరన్న కృష్ణదేవరాయని తండ్రితాతల కాలములోనే యున్నవా డగుటచేతను, తాతంభట్టు కృష్ణరాయని కాలమునకు బూర్వమునం దుండినవా డయినట్టు తోచదు. ఇతడు కవిచింతామణి యందు వ్యాకరణము ను, ఛందస్సు ను, కావ్యలక్షణమునుగూడ గొంత వఱకు జెప్పియున్నాడు. ఈలక్షణవేత్త కవిచింతామణియందు దన్ను గూర్చి వేసికొన్నపద్యము.
వెల్లంకి తాతంభట్టు తండ్రి పేరేంటి?
Ground Truth Answers: యబ్బయ్యయబ్బయ్యయబ్బయ్య
Prediction: